టీడీపీ నేతలపై దాడులు.. ప్రజా వేదిక కూల్చివేత సహా అనేక అంశాలపై అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు.. యూరప్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన చంద్రబాబుకు.. ఇటీవలి పరిణామాలను నేతలు వివరించారు. మరోవైపు చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను తగ్గించడంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.