ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆపరేషన్ లోటస్ ఉధృతం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న అనగాని.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటున్నారు బీజేపీ నేతలు.