ఆ పనులను ఆపేసిన జగన్.. కేసీఆర్ చెప్పిన దానికి ఎందుకు తలూపుతున్నారు : దేవినేని ఉమ
సీఎంల సమావేశంలో గత ప్రభుత్వం హాయంలో జరిగిన కృష్ణా- గోదావరి అనుసంధానంపై ఎందుకు చర్చించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 263 టిఎంసీల నీటిని మళ్లించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టుల పనుల ఆపేసిన జగన్.. కేసీఆర్ చెప్పిన దానికి ఎందుకు తలూపుతున్నారన్నారు. ఏపీలో ఉన్నప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకే జగన్.. బార్డర్ దాటి తెలంగాణలో అడుగుపెడితే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమిటీలు కనిపించడం లేదన్నారు.