వార్షిక బడ్జెట్కు ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత భాజపా ఎంపీల తొలి సమావేశం ఇదే. బడ్జెట్తో పాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, పార్టీ అజెండా గురించి ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఈ భేటీని జూన్ 25నే నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మరణంతో పార్లమెంటరీ పార్టీ భేటీని వాయిదా వేశారు. తిరిగి ఈరోజు సమావేశమయ్యారు. జులై 5న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఇవాళ్టి సమావేశంలో చర్చించారు. అయితే బీజేపీ అగ్ర నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ లేకుండా జరిగిన బీజేపీ తొలి పార్లమెంటరీ భేటీ ఇదే.