వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త..

Update: 2019-07-04 09:12 GMT

ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైసీపీలో చేరారు. డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ నేత అంబికా కృష్ణకు ఆయన సోదరుడు అవుతారు. ఇటీవల టీడీపీని వీడిన అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో ఏలూరు వైసీపీ నాయకురాలు మధ్యాన్నపు బలరాం ఈశ్వరి, కొవ్వూరు, ఏలూరు నియోజకవర్గాల వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News