వైసీపీ కార్యకర్తల దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామసర్పంచ్ అడ్డాల రాముపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. జగన్గారూ ఈ దాడులను ఖండించడానికి మీకు మనసురావడంలేదా, లేదా మీ వాళ్లను అదుపుచేయలేని అమసర్థతతో ఉన్నారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుంచుకోండని లోకేష్ ట్వీట్ చేశారు.