కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు స్పందించలేదంటూ సీఎం జగన్ చేసిన విమర్శలపై... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. జగన్ మాటలకు కౌంటర్ ఇస్తూ... టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను ట్వీట్ చేశారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా..?అని జగన్గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. జూన్ 21 న సాక్షి పత్రికలోనే వచ్చిందని.. అప్పుడు తమరు గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో అంటూ లోకేష్ సెటైర్ వేశారు.
కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా ? అని @ysjagan గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో ఈ రోజు అసెంబ్లీలో అడిగారు. ఇది జూన్ 21, 2018న మీ అవినీతి 'సాక్షి'లో వచ్చిన వార్త. pic.twitter.com/7H8wdI0gKB
— Lokesh Nara (@naralokesh) July 11, 2019