మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడో ప్రబుద్దుడు. ఆ విషయం తెలుసుకు న్న మొదటి భార్య ఆందోళనకు దిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన మంజులకు, నందిపేటకు చెందిన ప్రమోద్తో వివాహం జరిగింది. ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా పని చేస్తున్న ప్రమోద్, పెళ్లైన నెల రోజులకే బార్యను వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ హింసించాడు. అక్కడితో ఆగకుండా కట్నం కోసం రహస్యంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడంటూ మంజుల ఆందోళనకు దిగింది.