ఏపీలో బీజేపీలో చేరేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు ఎదురుచూస్తున్నారని తెలిపారు... ఎమ్మెల్సీ మాధవ్. ఇప్పటికే కమ్మ, కాపు సామాజిక వర్గ నాయకులతో టచ్లో ఉన్న బీజేపీ ఇప్పుడు తాజాగా రెడ్డి సామాజిక వర్గ నేతలతో కూడా మంతనాలు జరుపుతోందని చెప్పారు. ఆగస్టు నాటికి టీడీపీతో పాటు పలువురు వైసీపీ నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వెల్లడించారు.