SC: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

Update: 2025-12-19 03:30 GMT

పా­ర్టీ ఫి­రా­యిం­చిన ఎమ్మె­ల్యేల వ్య­వ­హా­రం తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో హాట్ టా­పి­క్ గా మా­రిం­ది. అధి­కార, ప్ర­తి­ప­క్షాల మధ్య మాటల యు­ద్ధం కొ­న­సా­గు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో నేడు సు­ప్రీం కో­ర్టు­లో తె­లం­గాణ ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యేల కేసు వి­చా­రణ జర­గ­నుం­ది. జస్టి­స్ దీ­పాం­క­ర­ద­త్త, జస్టి­స్ అగ­స్టి­న్ జా­ర్జ్ ల ధర్మా­స­నం కేసు వి­చా­రణ జర­ప­ను­న్నా­రు. 5 మంది ఎమ్మె­ల్యేల అన­ర్హత పి­టి­ష­న్ పై అసెం­బ్లీ స్పీ­క­ర్ గడ్డం ప్ర­సా­ద్ తీ­ర్పు ప్ర­క­టిం­చా­రు. ఎమ్మె­ల్యే­లు పా­ర్టీ మా­ర­లే­ద­ని స్పీ­క­ర్ స్ప­ష్టం చే­శా­రు. అన­ర్హత పి­టి­ష­న్ లను కొ­ట్టి­వే­శా­రు. ఎమ్మె­ల్యే­లు అరి­కె­పూ­డి గాం­ధీ, తె­ల్లం వెం­క­ట్రా­వు, బం­డ్ల కృ­ష్ణ­మో­హ­న్‌ రె­డ్డి, గూ­డెం మహి­పా­ల్‌ రె­డ్డి, ప్ర­కా­శ్‌ గౌ­డ్‌­ల­పై అన­ర్హత వేటు వే­య­డా­ని­కి ని­రా­క­రిం­చా­రు. గత వి­చా­రణ సం­ద­ర్భం­గా స్పీ­క­ర్ నా­లు­గు వా­రా­ల్లో­గా కో­ర్టు ధి­క్కార పి­టి­ష­న్ పై జవా­బు చె­ప్పా­ల­ని కో­ర్టు ఆదే­శిం­చిం­ది. పా­ర్టీ ఫి­రా­యిం­పుల వ్య­వ­హా­రం­పై డి­సెం­బ­ర్ 18వ తేదీ లోపు ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని అసెం­బ్లీ స్పీ­క­ర్‌­కు సు­ప్రీం­కో­ర్టు సూ­చిం­చిం­ది. స్టాం­డిం­గ్ కౌ­న్సి­ల్ ద్వా­రా స్పీ­క­ర్ కు నో­టీ­సు­లు పం­పిం­ది. ఎమ్మె­ల్యేల అన­ర్హ­త­పై మీరు ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­రా? మేము తీ­సు­కో­వా­లా ? అంటూ ప్ర­శ్నిం­చిం­ది. తె­లం­గాణ ఎమ్మె­ల్యేల ఫి­రా­యిం­పు వ్య­వ­హా­రం­లో కో­ర్టు­ది­క్కార పి­టి­ష­న్ పై తె­లం­గాణ స్పీ­క­ర్ కు సు­ప్రీం­కో­ర్టు నో­టీ­సు­లు జారీ చే­సిం­ది. ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యే­ల­పై మూడు నె­ల­ల్లో­గా ని­ర్ణ­యం తీ­సు­కో­క­పో­వ­డం­పై కో­ర్టు ధి­క్కార పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు కే­టీ­ఆ­ర్. రో­జు­వా­రీ­గా వి­చా­రణ జరి­పి ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని గవా­యి సూ­చిం­చా­రు. 4 వా­రా­ల్లో­గా వి­చా­రణ పూ­ర్తి చే­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు.

స్పీ­క­ర్ ని­ర్ణ­యం పట్ల ఎవ­రి­కై­నా అసం­తృ­ప్తి ఉంటే.. ప్ర­జా­స్వా­మ్యం­లో న్యా­య­స్థా­నా­లు ఉన్నా­య­ని.. అక్క­డి­కి వె­ళ్లి తమ వా­ద­న­లు వి­ని­పిం­చు­కో­వ­చ్చ­ని సూ­చిం­చా­రు. బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ­కి 37 మంది ఎమ్మె­ల్యే­లు ఉన్నా­ర­ని ఆ పా­ర్టీ నా­య­కు­డు హరీ­ష్ రావు స్వ­యం­గా ప్ర­క­టిం­చా­ర­ని రే­వం­త్ గు­ర్తు­చే­శా­రు. సభలో సభ్యుల సం­ఖ్య­ను బట్టి స్పీ­క­ర్ బు­లి­టె­న్ వి­డు­దల చే­సి­న­ప్పు­డు మౌ­నం­గా ఉండి.. ఇప్పు­డు రా­జ­కీయ లబ్ధి కోసం రచ్చ చే­య­డం సరి­కా­ద­ని మం­డి­ప­డ్డా­రు. బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ ప్ర­స్తు­తం క్రి­యా­శీల రా­జ­కీ­యా­ల­కు దూ­రం­గా ఉం­డ­టం­తో ఆ పా­ర్టీ­లో క్ర­మ­శి­క్షణ కరు­వైం­ద­ని ఎద్దే­వా చే­శా­రు. గజ్వే­ల్ ప్ర­జ­లు సైతం తమ నా­య­కు­డి­పై ఆశలు వదు­లు­కు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. తె­లం­గా­ణ­లో ఇటీ­వల జరి­గిన గ్రామ పం­చా­య­తీ ఎన్ని­కల ఫలి­తా­లు కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం చే­ప­ట్టిన ప్ర­జా­పా­ల­న­కు ని­ద­ర్శ­న­మ­ని సీఎం ధీమా వ్య­క్తం చే­శా­రు.

Tags:    

Similar News