బీసీలకు తీరని అన్యాయం చేశారు : యనమల

Update: 2019-07-21 08:02 GMT

బీసీలకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు. బీసీలకు స్థానిక సంస్థల్లో టీడీపీ రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. 139 కార్పోరేషన్లు పెడతామని జగన్‌ పాదయాత్రలో మాట ఇచ్చారని, ఇప్పుడు 40 కార్పొరేషన్లకే పరిమితం చేయాలని చూస్తున్నారని యనమల అన్నారు. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు తగ్గిస్తే బీసీలకు ఎలా న్యాయం చేసినట్లవుతుందని ప్రశ్నించారాయన. సామాజిక అన్యాయమే తప్ప సామాజిక న్యాయం జగన్‌ చేతకాదన్నారు యనమల.

Similar News