నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిందంటూ వైసీపీ నేతలు ఆశా కార్యకర్త వెంకటరమణమ్మను వేధించారు. వేధింపులు భరించలేక... సంగం మండలం చెన్నవరప్పాడులో వెంకటరమణమ్మ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే 108లో ఆమెను ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.