టీటీడీలో డీఈఓగా ఏపీ సీఎం జగన్ బంధువు క్రిష్టోఫర్ను నియమించినట్లు మా వెబ్సైట్లో తప్పుగా కథనం వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి మా వెబ్ సిబ్బంది ఈ వార్తను పోస్ట్ చేశారు. అయితే ఆ వార్త నిజం కాదని తేలింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. మత పరమైన అంశాల విషయంలో టీవీ5 తొలి నుంచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఈ తప్పుకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చర్య తీసుకుంటామని వెబ్ పాఠకులకు తెలియజేస్తున్నాం.