రైలు నుంచి జారి పడ్డ వృద్ధుడు.. పరిస్థితి విషమం..

Update: 2019-08-11 07:57 GMT

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు నుంచి కాలు జారి కింద పడ్డాడు ఓ వృద్ధుడు. చీరాలకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తిరుపతి నుంచి ట్రైన్‌లో చీరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తూ కాలు జారీ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు హుటాహుటిన క్షతగాత్రుడ్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

Similar News