పార్టీ నేతలతో భేటీ, ప్రజా సమస్యలపై పోరాటం అంటూ బిజీగా ఉండే చంద్రబాబు ఇంటికి రాఖీ పండగ ఒక రోజు ముందే వచ్చింది. మాజీ మంత్రి పరిటాల సునీత, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. అన్నయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. స్వీట్లు పంచారు. ఆ తర్వాత కాసేపు ముచ్చటించారు. నరం వాపు కారణంగా చేతికి కట్టుతో ఉన్న ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు.