స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైటింగ్పై ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు. ఎవరైతే అమరావతి గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో.. వాళ్లచేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశారంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు. pic.twitter.com/aU7CV1tWZz
— N Chandrababu Naidu (@ncbn) August 15, 2019