ఇంట్లో తాగుడు మాన్పించే బాధ్యత ఆడవాళ్లే తీసుకోవాలి - గవర్నర్‌ నరసింహన్‌

Update: 2019-08-15 09:03 GMT

తెలంగాణలో ఉన్న అక్కాచెల్లెళ్లలకు రాఖీ పండుగ శభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లల్ని కాపాడే బాధ్యత మనదేనన్నారాయన. ఆడవాళ్లు ఇంట్లో, బయట స్వచ్చత పాటించాలని.. ఇంట్లో తాగుడుని మాన్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తోందన్న ఆయన.. స్త్రీలంతా ఏదోపని చేయాలన్నారు గవర్నర్‌. రాఖీ పౌర్ణమి సంధర్భంగా.. గవర్నర్‌కు రాఖీలు కట్టారు బ్రహ్మకుమారీలు. ప్రజలంతా రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు గవర్నర్‌.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో పాటు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

 

Full View

Similar News