ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు వ్యక్తులు డ్రోన్ కెమెరా ద్వారా చంద్రబాబు నివాస దృశ్యాలు షూట్ చేస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. జెడ్ కేటగిరి భద్రత ఉన్న నేత ఇంటిపై డ్రోన్ కెమెరాలు ఎలా అనుమతించారంటూ పోలీసుల్ని ప్రశ్నించారు దేవినేని అవినాష్. ఈ సందర్భంగా పోలీసులకు అవినాష్కు మధ్య వాగ్వాదం జరిగింది.
Also Watch :