తెలంగాణలో టీఆర్ఎస్కు సరైన ప్రత్యామ్నయం బీజేపీనే అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో అంటకాగుతోందన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ సాధన లక్ష్యాలను కేసీఆర్ సర్కారు ఎప్పుడో మరచిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పెద్ద సంఖ్యలో నాయకుల చేరికతో బీజేపీ బలోపేతమవుతుందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.