ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తిరుపతిలో రాష్ట్ర పౌరసరఫరాల ఛైర్మన్ సైకం జయచంద్రారెడ్డితో పాటు పలువురు రాంమాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ముందుకు సాగుతోందని అన్నారు రాంమాధవ్.