రాజధాని మార్పు గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. తాను కేవలం శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే అన్నానని.. మిగతా అంశాలపై చర్చిస్తున్నామని మాత్రమే చెప్పానని తెలిపారు. తన మాటలను కొంతమంది ఇష్టారీతి మార్చేసుకున్నారంటూ నెపం మీడియాపై నెట్టేశారు.