రాజధాని ప్రాంత రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం అత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఆయనతో సమావేశం అయ్యారు. రాజధాని తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అయితే అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు వెంకయ్యనాయుడు..