అమరావతి, పోలవరంపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-09-01 12:18 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్నదే బీజేపీ అభిమతమని స్పష్టం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని... అందువల్ల రాజధాని అక్కడే కొనసాగుతుందన్నారు. దీనిపై మరో ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా బీజేపీ కట్టుబడి ఉందని.. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్లనే నిర్మాణంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు.

Similar News