వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో సాగిందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వంద రోజుల పాలనలో కూల్చివేతలు, కక్ష సాధింపులు, రివర్స్ టెండరింగ్లు తప్ప.. ప్రజల ఆమోదయోగ్యమైన కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు మిగిలిన ఐదేళ్లు పరిపాలనను అందించే సామర్థ్యం వైసీపీకి లేదన్నారు.