తెలంగాణ గవర్నర్ నరసింహన్కు ప్రభుత్వం వీడ్కోలు పలికింది. ప్రగతిభవన్లో కార్యక్రమం నిర్వహించారు. వీడ్కోలు కార్యక్రమానికి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఎమ్మెల్యేలకు పర్మిషన్ లేదని వెనక్కు పంపారు. అదే సమయంలో మంత్రి తలసాని తనయుడు, సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సాయి కిరణ్ను మాత్రం అనుమతించారు.