మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులుకు వెంటనే శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు.. ఈసారి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తిరిగి ఐటీ, మున్సిపల్ శాఖలను కేటాయించారు. ఇక మరో కీలకమైన విద్యాశాఖను మాజీ హోమ్ శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేటాయించారు.
మంత్రుల శాఖలు ఇవే..
కేటీఆర్: ఐటీ, మున్సిపల్, , మైనింగ్, పరిశ్రమలు
హరీష్ రావు: ఆర్థిక శాఖ
సబితా ఇంద్రారెడ్డి: విద్యాశాఖ
గంగుల కమలాకర్: బీసీ సంక్షేమ, పౌరసరఫరాలు
సత్యవతి రాథోడ్: గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ
పువ్వాడ అజయ్ కుమార్: రవాణా శాఖ