TS 10th Exam Results : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు

Update: 2024-04-30 06:07 GMT

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి ఫలితాల్లో 91.31% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలికలే సత్తా చాటారు. బాలికలు 93.23శాతం ఉత్తీర్ణత సాధించగా...బాలురు 89.42 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం 3927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా 6 ప్రైవేట్ పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. నిర్మల్ జిల్లా 99.05 శాతం తో మొదటి స్థానం ఉండగా.. 65.10 శాతం సాధించి వికారాబాద్ చివరి స్థానంలో ఉంది.

జూన్ 3 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని ద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం తెలిపారు. మార్కుల పై విద్యార్థులకు డౌట్స్ ఉంటే రీ వాల్యూయేషన్ రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గురుకులాలలో 98.71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5.08,385 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది.

https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను కనుగొనవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది.

Tags:    

Similar News