TS : నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ ప్రచారం

Update: 2024-04-30 05:27 GMT

రాష్ట్రంలో ప్రచారం ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు అటెండ్ అవుతారు. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం. తర్వాత రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్నారు రేవంత్ రెడ్డి.

మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో జరిగే జనజాతర సభకు హాజరు కానున్నారు సీఎం.. పబ్లిక్ కు ఎండ తగలకుండా షామియానాలు, ఉక్కపోయకుండా ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాట్టు చేశారు .సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

సాయంత్రం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రేగొండలో మధ్యాహ్నం 4 గంటలకు కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క హాజరుకానున్నారు. దీంతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ప్రత్యేక హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. జనజాతర సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు

Tags:    

Similar News