TS : కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-04-30 06:02 GMT

తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి బీఆర్ఎస్ చీఫ కేసీఆర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్‌ మళ్లీ పుట్టాడనిపిస్తోందంటూ ఆయన ట్వీట్ చేశారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్నగర్లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే నెలలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని విమర్శించారు.

Tags:    

Similar News