సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్లా.. లేనట్లా అంటూ నిలదీశారు. మాజీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అవమానకర రీతిలో పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. మీ చట్టాలన్నీ టీడీపీ అభిమానులపై కేసులు పెట్టేందుకేనా అని ప్రశ్నించారు లోకేశ్ .
అవమానకర రీతిలో మార్ఫింగ్ చేయడాన్ని భావప్రకటన స్వేచ్ఛ అంటే అది టీడీపీ వాళ్లకు కూడా వర్తిస్తుందన్నారు లోకేష్. గతంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకొని.. వాళ్లకు బహిరంగ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. గౌరవ హోం మంత్రి సుచరితగారు ఇలాంటి మార్ఫింగ్లకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు లోకేశ్.
కాదు ఇదే భావప్రకటనా స్వేఛ్చ అంటే అది తెదేపా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. తెదేపా వాళ్ళ మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని వాళ్ళకు బహిరంగంగా క్షమాపణ చెప్తారా? @AndhraPradeshCM #DGPAP అలాగే గౌరవ హోమ్ మంత్రి సుచరితగారు దీనికి ఏమని సమాధానం చెప్తారు?#YSJaganFailedCM
— Lokesh Nara (@naralokesh) September 11, 2019
Also watch :