విశాఖ జిల్లాకు చెందిన మరో నలుగురు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కచ్చులూరు బోటు ప్రమాదంలో గాజువాక దగ్గర చిన్న గంట్యాడకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు గల్లంతైనట్టు తెలుస్తోంది. మహేశ్వరెడ్డి భార్య స్వాతి, కుమార్తె హాన్సిక, కుమారుడు విఖ్యాత్లు పడవ ప్రమాదంలో గల్లంతైనట్టు తెలుస్తోంది. గోపాలపట్నానికి చెందిన వారి బంధువు సీతారామరాజుతో కలిసి రాజమండ్రి వెళ్లిన ఆ నలుగురు గల్లంతయ్యారని కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశారు.