చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. శివప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు టీడీపీ అధినేత. తన చిన్ననాటి స్నేహితుడు త్వరగా కోలుకుంటారని శివప్రసాద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.