కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారి పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి.. పరస్పర దాడులకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు పెప్పర్ స్పే, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలు అయ్యాయ.. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.