తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులను రేపటి నుంచి ప్రారంభించననున్నట్లు తెలిపారు కాకినాడ బాలాజీ మెరైన్స్ కు చెందిన ధర్మాడి సత్యం. ఇందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నట్లు చెప్పారు. గోదావరిలో బోటు ఎక్కడ ఉందో అక్కడ లోపలి వరకు లంగరు వేసి బయట ఉన్న మిషన్ ద్వారా బయటకు తీస్తామని వెల్లడించారు. బోటు వెలికితీతకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని చెప్పారు ధర్మాడి సత్యం.
Also watch :