అధికారుల పర్యవేక్షణలోనే బోటు ప్రయాణాలు - అవంతి

Update: 2019-10-04 03:14 GMT

రాబోయే రోజుల్లో బోటు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఇకపై అధికారుల పర్యవేక్షణలోనే బోటు ప్రయాణాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం బోటు వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని అవంతి తెలిపారు. బోటు ప్రమాదంలో మరణించిన విశాఖ జిల్లాకు చెందిన 9 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున.. 90 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో ఆర్థిక సాయాన్ని అందజేశారు మంత్రి అవంతి శ్రీనివాస్‌.

Similar News