పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ పిటిషన్నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలంటే కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది.