రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

Update: 2019-10-10 11:44 GMT

రైతు వద్ద నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ తహసీల్దార్‌. కర్నూలు జిల్లా సంజమాల మండల తహసీల్దార్‌ గోవింద్‌సింగ్‌ పొలం పాస్‌ బుక్‌ విషయంలో ఓ రైతు నుంచి రూ. ఐదు వేలు డిమాండ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో గోవింద్‌సింగ్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన ఆస్తుల వివరాలపైనా విచారణ చేపట్టారు అధికారులు.

Similar News