పంది దాడిలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో చోటు చేసుకుంది. నడవలేని స్థితిలో ఇంట్లో ఉన్న వృద్ధుడు కొండయ్య తల, చేతిపై దాడి చేసింది.. దీంతో ఆయన అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పందులను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పందుల బెడద ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు.