ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం : జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

Update: 2019-10-18 12:46 GMT

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్నారు ఆర్టీసీ సంఘాల జేఏసీ కన్వినర్ అశ్వత్థామరెడ్డి. చర్చలు చర్చలే...సమ్మె సమ్మెనే అన్నారు. చర్చల తర్వాతే సమ్మె విరమణ ఉంటుందని అశ్వత్థామరెడ్డి తెలియజేశారు. శనివారం బంద్ యథావిధిగా కొనసాగుతుందన్న అయన.. 26 డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు రావాల్సిందేనని తెగేసి చెప్పారు.

Similar News