నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీమేద జూనియర్ కళాశాలలో బైపీసీ సెకెండ్ ఇయర్ చదువుతున్న వర్ష ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకింది. వెంటనే గమనించిన కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. వర్ష ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.