తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. యాదాద్రి జిల్లా గుండాల MRO కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఓవైపు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా.. VRO లంచం తీసుకుని పాస్ బుక్ ఇవ్వడంలేదని ఓ మహిళ నిలదీసింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.