హైకోర్టు సూచనల మేరకు ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలని కన్వినర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామనడం సమంజసం కాదన్నారు. చల్ ట్యాంక్బండ్ నిరసన కార్యక్రమంలో కార్మికులు, ప్రజాసంఘాలపై జరిగిన లాఠీఛార్జ్ను జేఏసీతో పాటు విపక్ష నేతలు ఖండించారు.