ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థి సాయి కిరణ్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టీచర్ కొట్టడంతో తాను చనిపోతున్నట్లు లేఖ రాశాడు. లేఖలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సాయి కిరణ్ మృతికి కారణమైన టీచర్పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.