ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఇలాంటి అధికారులను సీఎం జగన్ కట్టడి చేయాలంటూ సోమువీర్రాజు, విష్ణువర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రిలో గాయత్రీ మాతా దేవాలయాన్ని తొలగించేందుకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తల మీటింగ్లో వీరు పాల్గొన్నారు.