సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో మద్యం దుకాణాల ముందు మహిళలను నిరసనకు దిగారు. జనావాసాల మధ్య దుకాణాలు నిర్వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు పెట్టడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మందు బాబులు రోడ్లపై మద్యం తాగి సీసాలను పగలగొడుతున్నారని ఆరోపించారు. వెంటనే నివాస ప్రాంతాల మధ్య ఉన్న వైన్ షాపులను వెంటనే మరో ప్రాంతానికి తరలించారు.