ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. నల్లమల అడవిలోని గిరిజన గ్రామమైన పాలుట్లలో అన్యమత ప్రచారానికి 19 మంది యువకులు వెళ్లారు. వీరంతా కర్నూలు జిల్లా, రంగాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ 19 మంది యువకుల్ని పాలుట్లలోని గిరిజనులు అడ్డుకున్నారు. అనుమతిలేకుండా అడవిలోకి వెళ్లిన.. అన్యమత ప్రచారకులను అదుపులోకి తీసుకున్నారు గంజివారిపల్లె రేంజ్ అటవీశాక అధికారులు.