పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు రాజ్యసభ సభ్యులు కేవీపీ. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున... పూర్తి చేసే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అన్న కేవీపీ.. ప్రాజెక్టును పూర్తిచేస్తే రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు.