పేదల కోసం సీఎం జగన్ అనేక మంచి పథకాలు తీసుకొచ్చారన్నారు వల్లభనేని వంశీ. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. పోలవరం కుడికాలువపై మోటార్ల విషయం, ఇంగ్లీష్ మీడియం.. తదితర పథకాలు తీసుకువచ్చారన్నారు. టీడీపీలో ఉండలేకపోతున్నానని.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని వల్లభనేని వంశీ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు.