పసుపు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థను కేంద్రం ఇవ్వనుందని తెలిపారు... ప్రభుత్వం మద్దతు ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు ఎంపీ. కానీ ప్రభుత్వమే పంపడం లేదని ఆరోపించారు.. త్వరలోనే తెలంగాణలోని పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.