రాజధాని అన్నది ఉపాధి కేంద్రంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందనే కారణంతోనే అమరావతిని ఎంచుకోవడం జరిగిందన్నారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు రాజధాని ముంపుకు గురయ్యే అవకాశం లేదన్నారు.
సింగపూర్కు ప్రపంచంలోనే ఒక గౌరవప్రదం ఉందన్నారు చంద్రబాబు. సంపద సృష్టిస్తారని చెప్పబట్టే సింగపూర్తో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.